మంగళగిరిలో ఏపీఎల్ సందడి... ట్రోఫీ ఆవిష్కరించిన రామ్ చరణ్

  • మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన రామ్ చరణ్
  • యువ ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ గొప్ప వేదిక అన్న గ్లోబల్ స్టార్
  • ప్రారంభమైన భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్
  • జూన్ 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్
  • కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఏసీఏ అధ్యక్షుడు
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుధవారం మంగళగిరిలో సందడి చేశారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని, జట్ల జెర్సీలను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ఏపీఎల్ యువ క్రికెటర్లకు ఒక గొప్ప అవకాశమని ప్రశంసించారు. రాష్ట్రంలో కొత్త ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి లీగ్‌లు ఎంతో దోహదపడతాయని అన్నారు. టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ రాకతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమం అనంతరం భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి సానా సతీశ్ (రాజ్యసభ సభ్యుడు), ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు జూన్ 27 వరకు జరుగుతాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్ ప్రారంభమై, జూన్ 30న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం 6 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో భీమవరం బుల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.



Ram Charan
Andhra Premier League
APL Trophy Unveiling
Mangalagiri ACA Stadium
Andhra Cricket Association
Ram Charan Mangalagiri Visit

More Telugu News